చంద్రబాబు గ్రాఫిక్స్ కి పరిమితమయ్యారు: పురంధేశ్వరి


 అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి బీజేపీ సమర్ధిస్తుందని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. టీడీపీ, వైసీపీ.. రైతులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు ప్రభుత్వానికి మాత్రమే భూములు ఇచ్చారని చెప్పారు. కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు గ్రాఫిక్స్ కి పరిమితమయ్యారని మండిపడ్డారు. జీఎన్ రావు కమిటీ నివేదిక బహిర్గతం అవలేదు..క్యాబినెట్ లో చర్చ జరగాలన్నారు.