కొత్తగా జారీ చేస్తున్న పాస్పోర్ట్ ల్లో కమలం గుర్తును ముద్రించడంపై గురువారం విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. కమలం గుర్తును ముద్రించడం నకిలీ పాస్పోర్ట్ లను గుర్తించేందుకు ఉద్దేశించిన భద్రతా చర్యల్లో భాగమని తెలిపింది. 'కమలం జాతీయ పుష్పం. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని ముద్రించాం' అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మిగతా జాతీయ చిహ్నాలను కూడా రొటేషన్ పద్ధతిలో ముద్రిస్తామని వివరించారు.
అందుకే పాస్పోర్ట్ లో కమలం