పాదాలు మెరవాలంటే...

 



టమాట గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును పాదాలకు రాయాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. సమపాళ్లలో కీరదోస, నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి. పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.