పౌరసత్వ చట్టాన్ని అమలు చేసి తీరుతాం


 పౌరసత్వ సవరణ చట్టం (CCA)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ BJP కార్యనిర్వాహక అధ్యక్షుడు JP నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. CCA ని అమలు చేసి తీరుతామని, భవిష్యత్ లో NRC ని కూడా తీసుకొస్తామని ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు శరణార్థులతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలో భారత్ ముందుకు సాగుతోందని, CCA, NRC అమలు చేసి తీరుతామని నడ్డా స్పష్టంచేశారు.