CM జగన్ , మహిళ పక్షపాతి అని మరోసారి నిరుపించుకున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల రక్షణకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. యానిమేటర్లు, సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదివేలకు పెంచారని, మహిళల, పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని, అలాగే పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని CM జగన్ నెరవేరుస్తున్నారని తెలిపారు.