హైదరాబాద్, అమరావతి, విజయవాడ సహా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. డీజిల్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. పెట్రోల్ ధరల్లో 18 పైసల నుంచి 20 పైసల వరకు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ. 78.36 కి చేరగా లీటర్ డీజిల్ ధర రూ. 71.80 వద్ద కొనసాగుతోంది. అమరావతిలోనూ ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు పెరిగి రూ. 17.95 కు చేరింది.