మేడారం జాతర తేదీలు ఖరారు


 తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర పండుగైన మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరిలో 05.02.2020 న బుధవారం సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 06.02.2020 నాడు గురువారం సమ్మక్క గద్దెకు చేరుతుంది. ఫిబ్రవరి 07.02.2020 శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 08.02.2020 శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుందని జాతర పూజారులు వెల్లడించారు.