2022 నాటికి భారత్ లో 5జీ సేవలు

 



 భారత్ లో 5జీ సేవలు 2022లో అందుబాటులోకి రానున్నాయని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ (EMR) పేరిట తాజాగా విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్ సబ్ స్క్రిప్షన్లు ఎల్టీఈని కలిగి ఉంటాయని అంచనాకట్టింది.