శాంసంగ్లో 1,200 నియామకాలు


 ప్రస్తుత ఏడాదిలో 1200 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ బుధవారం ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో పనిచేయడం కోసం వీరిని ఐఐటీ, ఎన్ఏటీ, ఐఐఎస్సీల నుంచి ఎంపికచేయనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ కేంద్రాల్లో నియామకాలు ఉంటాయని వివరించింది.