యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ అనే పంచాయతీ కార్యదర్శి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు 16 లక్షల రూపాయల నగదును బ్యాంకునుంచి డ్రా చేసింది. వాటిని బ్యాగులో ఉంచి ఆటోలో తీసుకెళుతుండగా కుళ్లాయప్ప అనే దొంగ ఆమెను బెదిరించి డబ్బుల బ్యాగును లాక్కెళ్లిపోయాడు అక్కడి గ్రామాల పెద్దలకు సమాచారం ఇవ్వటంతో పాటు గాలింపు చేపట్టారు. దాదాపు వెయ్యిమంది ప్రజలు దొంగను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. దొంగని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.