నేటి నుంచి షెడ్యూల్ ప్రకారం బస్సులు

 


హైదరాబాద్: నేటి నుంచి అన్ని డిపోల్లో షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవనున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. RTC అధికారులు, ఆర్డీవోలతో మంత్రి అజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతీ బస్సులో టికెట్ ధరల పట్టిక పెడతామన్నారు. టికెట్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయమని తెలిపారు. ప్రతి బస్సులో పాన్లు కచ్చితంగా అనుమతించాల్సిందేనని ఆదేశించారు.