దావోస్ లో మోదీ పై బిలియనీర్ ఫైర్


ప్రధాని నరేంద్ర మోదీపై హంగరీ అమెరికన్ బిలియనీర్, దాతృత్వశీలి జార్జ్ సోరోస్ దావోస్ వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యయుతంగా అధికార పగ్గాలు చేపట్టిన మోదీ భారత్ లో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తున్నారని, ముస్లిం ప్రాబల్య కశ్మీర్ లో నియంత్రణలు విధిస్తూ ముస్లింల పౌరసత్వాన్ని లాగేసుకునేలా వారిని బెదరగొడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనా సొరోస్ విమర్శలు గుప్పించారు.